News March 17, 2024

శ్రీకాకుళం: జాతీయ లోక్ అదాలత్‌లో 1782 కేసులు పరిష్కారం

image

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, ఇచ్చాపురం కోటబొమ్మాలి, నరసన్నపేట పాలకొండ, పలాస, పాతపట్నం రాజాం, సోంపేట, టెక్కలి, కొత్తూరు పొందూరు కోర్టులలో జరిగిన జాతీయ లోక్‌ అదాలత్ మొత్తం 1782 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేసినందుకు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Similar News

News September 29, 2024

షూటింగ్ పోటీల్లో టెక్కలి విద్యార్థిని ప్రతిభ

image

సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని వజ్జ ప్రణవి ప్రతిభ కనబరిచింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన సీబీఎస్ఈ అండర్-14 షూటింగ్ పోటీల్లో వెండి పథకం సాధించింది. ఎయిర్ రైఫిల్ లో 400 షూట్లకు గాను 391 పాయింట్లు సాధించింది. అక్టోబర్ 21 నుంచి 25 వరకు భోపాల్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.

News September 29, 2024

శ్రీకాకుళం: భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

image

దసరా పండగ ముంగిట నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. నూనె లీటర్‌ పై రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240, పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి కేజీ రూ.60కి తగ్గడం లేదు. ధరలు భారీగా పెరగడంతో ఏదీ కొనలేక పోతున్నామని ప్రజలు అంటున్నారు.

News September 29, 2024

శ్రీకాకుళం జిల్లాలో భారీగా సీఐలు బదిలీ

image

విశాఖ రేంజ్‌లో 14 మంది సీఐలుకు శనివారం రాత్రి బదిలీలు జరిగాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు ఐదుగురు సీఐలు రానున్నారు. పాతపట్నం సీఐ నల్లి సాయిని విశాఖ వీఆర్‌కు బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జట్టి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రేంజ్ లో ఉన్న సీఐలు..శ్రీనివాసరావు(డీసీఆర్బీ), కృష్ణారావు (టాస్క్ ఫోర్స్), సూర్యచంద్రమౌళి (సీసీఎస్), ఎం.కృష్ణమూర్తి (డీటీసీ), వానపల్లి రామారావు (పాతపట్నం) స్థానాలకు వస్తున్నారు.