News January 3, 2025

6న విచారణకు రావాలని కేటీఆర్‌కు ACB నోటీసులు

image

TG: ఫార్ములా-ఈ రేస్ కార్ స్కాం కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 6న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అటు బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌కు కూడా నోటీసులిచ్చింది. కాగా ఇప్పటికే ఈ స్కాంపై విచారణ చేపట్టిన ఈడీ.. ఈనెల 7న విచారణకు రావాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన 6న ఏసీబీ, 7న ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.

Similar News

News November 12, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హోంమంత్రి అనిత సూచించారు. డ్రగ్స్ వాడినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి జగన్ ప్యాలెస్‌ కట్టుకున్నారని మంత్రి సత్యప్రసాద్ ఫైరయ్యారు. సెంటు పట్టా పేరుతో ₹7,500Cr దోచుకున్నారని ఆరోపించారు.
* శ్రీకాకుళం IIITలో సృజన్(20) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు కారణాలు తెలియరాలేదు.

News November 12, 2025

NIT వరంగల్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (<>NIT<<>>) వరంగల్‌ 3పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, B.Sc( Food Tech), MSc( Food Tech), BA/BSc(సైకాలజీ)లేదా MA/MSc(సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST, PWBDలకు రూ.300. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 12, 2025

పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని

image

ఢిల్లీ LNJP ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల బృందంతో సమావేశమై మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కాగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 12 మంది పౌరులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు.