News January 3, 2025
185కే ఆలౌట్.. భారత్ చెత్త రికార్డు

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే ఆలౌటైన భారత్ పలు అవాంఛిత రికార్డులను మూటగట్టుకుంది. 2023 నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో 200లోపు అత్యధిక సార్లు(5) ఆలౌటైన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో WI(3), AFG(3), BAN(3), SA(3) ఉన్నాయి. అలాగే 2024 నుంచి 80 ఓవర్లలోపే ఎక్కువసార్లు(14) ఆలౌటైన రెండో టీమ్గా భారత్ నిలిచింది. ఇంగ్లండ్(18) టాప్లో ఉంది. IND తర్వాత NZ(13), BAN(13), WI(12) ఉన్నాయి.
Similar News
News October 17, 2025
జనగణన.. వచ్చేనెల ఇళ్ల లెక్కింపు

దేశంలో జనగణన కసరత్తు మొదలైంది. NOV 10-30 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏరియాల్లో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ చేపట్టనున్నారు. 2027లో జనగణన తొలిదశ జరగనుంది. దేశాభివృద్ధి, ప్రజల పరిస్థితులు తెలుసుకునేందుకు దీన్ని నిర్వహిస్తారు. ఈ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందిస్తారు. దేశంలో 1872 నుంచి జనగణన చేస్తుండగా చివరిసారి 2011లో జరిగింది.
News October 17, 2025
విడిపోయినా కలవొచ్చు..

హిందూ వివాహ చట్టం-1955, సెక్షన్-9 ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి వివాహ బంధాన్ని పునరుద్ధరింపజేయమని కోరవచ్చు. సెక్షన్-10 ప్రకారం బంధం చెడకుండా విడివిడిగా ఉండటానికి న్యాయస్థానం ద్వారా అనుమతి కోరవచ్చు. న్యాయసేవల అధికారిక చట్టం ద్వారా స్త్రీలు, పిల్లలు ఉచిత న్యాయసేవలను పొందొచ్చు. ఎవరైనా మహిళను విచారణ జరిపేటప్పుడు ఆమె నివాసంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరపాలి.
News October 17, 2025
‘దేవుడివి సామీ’.. మహేశ్బాబుపై ప్రశంసలు

సూపర్స్టార్ మహేశ్బాబు తన ఫౌండేషన్ ద్వారా చేయిస్తోన్న ఉచిత గుండె ఆపరేషన్ల సంఖ్య తాజాగా 5వేలకు చేరింది. ఈ విషయాన్ని అభిమానులు పోస్ట్ చేస్తూ ‘దేవుడు’ అంటూ కొనియాడుతున్నారు. వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ‘మహేశ్బాబు ఫౌండేషన్’లో <