News January 3, 2025
APR 1 నుంచి బీమా విధానంలో ఆరోగ్యశ్రీ: మంత్రి సత్యకుమార్

AP: ఇప్పటి వరకు ప్రభుత్వం-ట్రస్టు విధానంలో అమల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)ను బీమాలోకి మార్చుతున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి 1.43 కోట్ల కుటుంబాలకు వర్తింపజేస్తామని తెలిపారు. ప్రతి ఫ్యామిలీకి రూ.2,500 వరకు ప్రీమియం ఉంటుందని, 3,257 రోగాలకు వర్తింపజేస్తామని పేర్కొన్నారు. రోగులకు ఇబ్బందిలేకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు వేగంగా బిల్లులు చెల్లిస్తాయని చెప్పారు.
Similar News
News January 11, 2026
T20 WC: బంగ్లా మ్యాచుల నిర్వహణకు పాక్ రెడీ!

భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో T20 WC మ్యాచులు ఆడేందుకు బంగ్లాదేశ్ <<18761652>>నిరాకరించిన<<>> విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని కోరింది. ఈ క్రమంలో శ్రీలంకలో బంగ్లా మ్యాచులు సాధ్యం కాకపోతే తమ దేశంలో జరిపేందుకు సిద్ధమని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని గ్రౌండ్లు రెడీగా ఉన్నాయని అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. కాగా బంగ్లా రిక్వెస్ట్పై ఇంకా ఐసీసీ నిర్ణయం తీసుకోలేదు.
News January 11, 2026
ఇతిహాసాలు క్విజ్ – 124 సమాధానం

ప్రశ్న: కురుక్షేత్రంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు?
సమాధానం: నాగలి ఆయుధం గల బలరాముడికి కౌరవ, పాండవులిద్దరూ సమానులే. అందుకే ఆయనకు యుద్ధం ఇష్టముండదు. ఓవైపు కృష్ణుడు ప్రాతినిధ్యం వహించే పాండవ సేన, మరోవైపు ప్రియ శిష్యుడు దుర్యోధనుడి కౌరవ సేన.. ఇద్దరూ బంధువులే కావడంతో ఎవరి పక్షం వహించలేదు. యుద్ధానికి ముందు ఆయుధాలు వదిలి ప్రశాంతత కోసం సరస్వతీ నది తీరం వెంబడి తీర్థయాత్రలకు వెళ్లాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 11, 2026
పండుగల్లో డైట్ జాగ్రత్త

పండుగ రోజుల్లో సాధారణంగా చాలా త్వరగా లేచి హడావిడిగా పనులు చేస్తుంటారు. టిఫిన్ చేసే టైం లేక కనిపించిన పిండి వంటలనే నోట్లో వేసుకుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకొని తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఈ సమయంలో కాఫీలు, కూల్ డ్రింకులు కాకుండా కొన్ని పండ్లు, పండ్ల రసాలు అందుబాటులో పెట్టుకోండి. దీంతో జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు త్వరగా భోజనం చెయ్యాలి.


