News January 4, 2025

రథసప్తమి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు:SKLM ఎస్పీ

image

రథసప్తమి వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ఠంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన అరసవల్లిలో పర్యటించారు. అనంతరం పోలీసులు, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ ఆలయ భౌగోళిక మ్యాప్, దేవస్థానం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ, డీఎస్పీ వివేకానంద ఉన్నారు.

Similar News

News January 15, 2026

సంక్రాంతి వేళ..శ్రీకాకుళంలో జరిగే జాతరలివే?

image

రైతుల కష్టానికి ప్రతీకగా సంక్రాంతి పండగను ఏటా ధనుర్మాసంలో జరుపుకుంటారు. మనకు అన్నీ సమకూర్చే భూమాతకు కృతజ్ఞతగా నేడు ఇళ్ల ముంగిట మహిళలు రంగవల్లులు వేస్తారు. శాస్త్రీయంగా, సైన్స్ ప్రకారం సూర్య గమనం నేటి నుంచి మారుతోంది. ఈ పండగ వేళ శ్రీకాకుళం జిల్లాలో జరిగే జాతరలివే:
✯ ఇచ్ఛాపురం: శివానందగిరిపై త్రినాథ్ స్వామి యాత్ర
✯ పలాస: డేకురుకొండ జాతర
✯ ఆమదాలవలస: సంగమయ్య కొండ జాతర

News January 15, 2026

ఎస్పీ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు

image

కవిరాజు, ప్రముఖ సాహిత్య, సామాజిక వేత్త త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు గురువారం శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధనపు ఎస్పీ శ్రీనివాసరావు రామస్వామి చౌదరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో మూఢనమ్మకాలు కుల వివక్షత అసమానతలపై ఆయన నిర్భయంగా పోరాటం చేశారన్నారు. మానవతా విలువలు చాటి చెప్పారన్నారు.

News January 15, 2026

శ్రీకాకుళం: బస్సుల్లో టికెట్ల ధర అధికంగా వసూలు చేస్తున్నారా?

image

శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రాంతాలకు వెళుతున్న బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి విజయ సారథి చెప్పారు. ఆర్టీజీఎస్ యాప్ సహకారంతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు తనిఖీలు సాగుతాయని వెల్లడించారు. అధిక ఛార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అలా చేస్తే హెల్ప్ లైన్ నంబర్ 9281607001 కు సంప్రదించాలన్నారు.