News January 4, 2025

VZM: కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 236 మంది గైర్హాజరు..!

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది . మొత్తం 550 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 314 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 236 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగింది.

Similar News

News March 8, 2026

పోలీస్ పరేడ్‌లో మహిళ దినోత్సవం: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం పోలీస్ పరేడ్‌లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, డీఆర్‌డీఏ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానిస్తామన్నారు.

News March 8, 2026

పోలీస్ పరేడ్‌లో మహిళ దినోత్సవం: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం పోలీస్ పరేడ్‌లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, డీఆర్‌డీఏ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానిస్తామన్నారు.

News March 7, 2026

కొత్తవలసలో యాక్సిడెంట్.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

image

కొత్తవలస మండలం అర్ధానపాలెం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. భీమాలి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఏ.పరదేశి (38) కొత్తవలస నుంచి భీమాలి వైపు ఆటోతో వెళ్తున్నాడు. విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురుఎదురుగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.