News January 4, 2025

ఇండియాలో తొలి బీటా బేబీ ఎవరంటే?

image

ఈ ఏడాది నుంచి కొత్త జనరేషన్ ప్రారంభమైంది. దీనిని జనరేషన్ బీటాగా పిలుస్తున్నారు. 2025-2039 మ‌ధ్య జ‌న్మించే పిల్ల‌ల‌ను జ‌న‌రేష‌న్ బీటాగా ప‌రిగ‌ణిస్తారు. మన దేశంలో తొలి బీటా శిశువు మిజోరం రాష్ట్రంలో జన్మించాడు. అతనికి ఫ్రాంకీ రెమ్రువాత్‌డికా జాడెంగ్ అని పేరు పెట్టారు. జనవరి 1న రాత్రి 12.03కు ఆ బాబుకు రామ్జీర్‌మావీ, జెడ్‌డీ రెమ్రువాత్‌సంగా దంపతులు జన్మనిచ్చారు.

Similar News

News January 13, 2026

తప్పుడు నివేదికలతో CBN కేసుల మూసివేత సిగ్గుచేటు: సతీశ్

image

AP: నిస్సిగ్గుగా తనపై నమోదైన కేసులను CBN ఒక్కొక్కటిగా మూసి వేయించుకుంటున్నారని YCP దుయ్యబట్టింది. ‘స్కామ్‌తో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది. ₹370 CR డొల్ల కంపెనీలకు వెళ్లాయని విచారణలో తేలింది. ఆధారాలు ఉండడంతో CBN జైలుకూ వెళ్లారు. ఇపుడు అధికార దుర్వినియోగంతో కోర్టుకు తప్పుడు నివేదిక ఇప్పించి కేసు మూసి వేయించడం సిగ్గుచేటు’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

News January 13, 2026

కుక్క కాటు మరణాలకు భారీ పరిహారం: SC

image

శునకాల నియంత్రణలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఎవరికైనా కుక్క కరిచి మరణిస్తే భారీ పరిహారం అందించేలా ఆదేశిస్తామని స్పష్టం చేసింది. కాగా ఏకపక్షంగా కాకుండా, సమగ్ర పరిష్కారం చూపాలని డాగ్ లవర్స్ SCని కోరారు. ప్రజలు వాటిని దత్తత తీసుకునేలా ఇన్సెంటివ్స్ ప్రకటించాలని సూచించారు. దీంతో అనాథలు, రోడ్లపై అభాగ్యులకు ఇది చేయొచ్చుగా? అని ధర్మాసనం ధ్వజమెత్తింది.

News January 13, 2026

ముగ్గులతో ఆరోగ్యం..

image

సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు ముగ్గులూ వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు కనువిందు చేస్తుంటాయి. హేమంతరుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం, గొబ్బెమ్మలను పెట్టడం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది.