News March 17, 2024
శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 28982 మంది ప్రైవేటు విద్యార్థులు 1592 మంది హాజరు కానున్నట్లు చెప్పారు.
Similar News
News March 9, 2026
శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్కు..రైతుకు రీలిఫ్ అందెనా?

ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీరు అందేనా? అన్న అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతుంది. వంశధార కాలువలలో పూడిక, గుర్రపు డెక్క నిండిపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు పారడం లేదు. జిల్లాలో వంశధార ఎడమ కాలువ ద్వారా సుమారు 2,11,030 ఎకరాలు సాగవుతుంది. ఉపాధి హామీ నిధులతోనైనా పిల్ల కాలువలు కాలువలలోని పూడిక తీత పనులు నిర్వహించి కాలువలను ఆధునీకరిస్తే శివారు ప్రాంత రైతుల ఆశలు నెరవేర్చవచ్చు.
News March 9, 2026
జలుమూరులో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

జలుమూరు మండలం లింగాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..లింగాలపాడుకు చెందిన సూర్యనారాయణ (79) సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తుండగా నరసన్నపేట వైపు వెళ్తున్న టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం వృద్ధుడు అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలను వదిలాడు. ఎస్సై అశోక్ బాబు కేసు నమోదు చేశారు.
News March 9, 2026
శ్రీకాకుళం: వైరల్.. సర్పంచ్గా గెలిపిస్తే ఫ్రీ WiFi అంట!

త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మందసకి చెందిన మోహన్ బాబు అనే వ్యక్తి ప్రకటించి హామీలు వైరల్ అవుతున్నాయి. గ్రామంలో వైఫై, సోలార్ లైటింగ్, ఆధునిక పార్కుల ఏర్పాటు వంటి ‘స్మార్ట్’ హామీలు ఇచ్చారు. అవినీతి లేని పాలన నుంచి యువతకు ఉపాధి వరకు గ్రామ బడ్జెట్కు మించి ఆయన ప్రకటించిన విజన్ చూసి, ఇది పల్లెటూరా లేక పారిస్ నగరా అని స్థానికులు సరదాగా చర్చించుకుంటున్నారు. ఈ మ్యానిఫెస్టోపై మీ కామెంట్?


