News March 17, 2024

నాగర్‌కర్నూల్‌: ఎంపీవోపై ఎంపీపీ దాడి

image

విధుల్లో ఉన్న ఎంపీవోను ఎంపీపీ ఆగ్రహంతో చెప్పుతో కొట్టిన ఘటన కోడేరులో జరిగింది. బాధితుడి వివరాలు.. పెండింగ్ బిల్లుల విషయంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇరువురు మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎంపీపీ వెంకటరాధ దుర్భాషలాడుతూ.. నా మాట ఎందుకు వినడంలేదంటూ ఎంపీ చెప్పుతో కొట్టి ఆగ్రహంతో వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఎంపీవో శ్రావణ్‌కుమార్‌ ఫిర్యాదుతో ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేశారు.

Similar News

News February 10, 2026

MBNR: సౌత్ జోన్.. నేడు చెస్ ఎంపికలు

image

సౌత్ జోన్ & ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెస్ (స్త్రీ) ఎంపికలను ఈనెల 10న నిర్వహిస్తున్నట్లు పాలమూరు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు “Way2News”తో తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఉన్న సంబంధిత కళాశాలల విద్యార్థులు బోనఫైడ్‌పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరు కావాలన్నారు. 17-25 లోపు వయసు ఉండాలన్నారు. ముఖ్య అతిథిగా వీసీ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారు.

News February 8, 2026

MBNR: రేపటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ డి.జానకి స్పందిస్తూ.. ప్రచార సమయం ముగిసిన వెంటనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 8, 2026

MBNR: రేపటితో ముగియనున్న ప్రచారం

image

ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్,18మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 3న మొదలైన ఎన్నికల ప్రచార హోరు రేపు సాయంత్రం ముగియనుంది. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 5నుంచి 6కార్నర్ మీటింగ్ లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంచేస్తున్నారు.