News January 5, 2025
పడిపోతున్న టెంపరేచర్.. వణికిస్తున్న చలి

తెలంగాణలో చలి వణికిస్తోంది. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే టెంపరేచర్ నమోదవుతోంది. నిన్న అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన తొమ్మిదేళ్లలో ఇక్కడ ఇదే కనిష్ఠ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.1, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 6.2, కామారెడ్డి జిల్లా డోంగ్లి, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.8 చొప్పున టెంపరేచర్ నమోదైంది.
Similar News
News November 5, 2025
అమరావతికి సలహాలు ఇవ్వండి

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి CRDA విజన్-2047 రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అర్బన్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ గైడ్లెన్స్ కోసం సలహాలు, అభ్యంతరాలను తెలపాలని ప్రజలు, సంస్థలను కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు <
News November 5, 2025
పెరటి కోళ్ల పెంపకానికి అనువైన రకాలివే..

పెరటి కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గంగా మారుతోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నాటుకోళ్ల కంటే పెరటి కోళ్ల పెంపకంతోనే అధిక ఆదాయం సాధ్యమంటున్నారు నిపుణులు. వనరాజ, గ్రామప్రియ, గ్రామలక్ష్మి, వనశ్రీ, రాజశ్రీ, గాగస్, కడక్నాథ్, ఆసిల్ పెంపకానికి అనువైన పెరటి కోళ్ల రకాలు. వీటిలో కొన్ని 6 నెలల్లోనే 2-3 కిలోల బరువు పెరిగి, ఏటా 150-180 గుడ్లు పెడతాయి.✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 5, 2025
దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

ఎకనామిక్ సర్వే (2024-25) ప్రకారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలసరి GDPలో దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా నిలిచింది. దీని తలసరి GDP ₹11.46 లక్షలు. ఆ తర్వాత గురుగ్రామ్ (₹9.05 లక్షలు), బెంగళూరు అర్బన్ (₹8.93L), గౌతమ్ బుద్ధ్ నగర్-నోయిడా, సోలాన్ (HP), నార్త్&సౌత్ గోవా, సిక్కిం, దక్షిణ కన్నడ, ముంబై(₹6.57L), అహ్మదాబాద్ ఉన్నాయి. ఐటీ, ఫార్మా కంపెనీలు, మెరుగైన కనెక్టివిటీ వల్ల రంగారెడ్డి టాప్లో నిలిచింది.


