News January 5, 2025
కుంభమేళాకు 13 వేల రైళ్లు

Jan 13 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాకు 13 వేల రైళ్లను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. పుష్కర కాలానికోసారి జరిగే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి 40 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చేవారి సౌలభ్యం కోసం 10K జనరల్ రైళ్లతో పాటు 3K ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కుంభమేళా ప్రారంభానికి ముందు NDRF బృందాలు మాక్డ్రిల్ నిర్వహించాయి.
Similar News
News January 25, 2026
నో కాస్ట్ EMI.. మీకు ఈ విషయాలు తెలుసా?

‘నో కాస్ట్ EMI’తో ఆన్లైన్లో వస్తువులు కొంటే వడ్డీ ఉండదని అనుకుంటాం. కానీ వస్తువు ధరలోనే వడ్డీ కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ‘నో కాస్ట్ EMI వల్ల భారీ డిస్కౌంట్లు కోల్పోతారు. అదనంగా ప్రాసెసింగ్ ఫీజు+GST కూడా చెల్లించాల్సి వస్తుంది. ఎక్కువ EMIల వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ పెరిగి సిబిల్ స్కోర్ తగ్గొచ్చు’ అని పేర్కొంటున్నారు. కొనేముందు అసలు ధరతో EMI ధర కంపేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News January 25, 2026
UK ప్రధాని ఫైర్.. వెనక్కి తగ్గిన ట్రంప్!

అఫ్గాన్ యుద్ధంలో US మినహా ఇతర నాటో దేశాల సైనికులు సరిగా పోరాడలేదన్న ట్రంప్ వ్యాఖ్యలపై UK PM స్టార్మర్ <<18942081>>ఫైరయిన<<>> సంగతి తెలిసిందే. దీంతో UK ఆర్మీని ప్రశంసిస్తూ ట్రంప్ SMలో పోస్ట్ పెట్టారు. ‘UK సైనికులు ధైర్యవంతులు, గొప్పవారు. ఎప్పుడూ USతోనే ఉంటారు. ఈ బంధం ఎప్పటికీ విడిపోలేనంత బలమైనది. AFGలో 457 మంది UK సైనికులు చనిపోయారు. వారంతా గొప్ప యోధులు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
News January 25, 2026
జనవరి 25: చరిత్రలో ఈ రోజు

1918: రష్యన్ సామ్రాజ్యం నుంచి “సోవియట్ యూనియన్” ఏర్పాటు
1969: సినీ నటి ఊర్వశి జననం
1971: 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు
✰ జాతీయ పర్యాటక దినోత్సవం
✰ ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
✰ జాతీయ ఓటర్ల దినోత్సవం


