News March 17, 2024

కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ప్రచారం.. 19న సభ

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 19వ తేదీన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో నిర్వహించనున్న వైసీపీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. స్థానిక ఆకుల వీర్రాజు విగ్రహం వద్ద మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగనుందని కొత్తపేట MLA, వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు.

Similar News

News September 3, 2025

రాజమండ్రి: ‘3.30 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు’

image

తూ.గో జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇప్పటివరకు 3,30,000 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం తెలిపారు. బుధవారం కేంద్ర జల్ జీవన్ మిషన్ అదనపు జాయింట్ సెక్రటరీ సి.కమల్ కిషోర్ న్యూ ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. జిల్లాలో దాదాపు 92 శాతం గృహాల వివరాలను ఐఎమ్‌ఐఎస్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశామని కలెక్టర్ వివరించారు.

News September 3, 2025

బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

బ్యాంకు ఖాతాలతో పాటు బీమా, పెన్షన్ సౌకర్యాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు నిర్వహించిన ఆర్థిక చేరిక సంతృప్తి ప్రచారం సదస్సులో ఆమె మాట్లాడారు. పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

News September 3, 2025

జిల్లాలో అవసరానికి తగిన యూరియా సరఫరా: కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరా సమయానుకూలంగా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లాకు అవసరమైన 26,000 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు 22,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు వివరించారు. దుకాణదారులు యూరియా, ఎరువులను అధిక ధరకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.