News January 5, 2025

RR: పథకం కావాలంటే భూమి ముక్కలు చేయాల్సిందే..!

image

RR,MDCL,VKB జిల్లాల్లో 10 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ప్రభుత్వ పథకాల కోసం భూమిని ముక్కలుగా చేసి కొడుకు, బిడ్డ, భార్య, పేర్ల మీద భూ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో రాష్ట్ర జనాభా సరాసరి 2015లో ఒక్కో వ్యక్తికి ఒక హెక్టారు భూమి ఉండాల్సి ఉండగా 2022 నాటికి అది 0.89 హెక్టార్లకు తగ్గింది. ప్రభుత్వ పథకాలకు కట్ ఆఫ్ పెట్టినా, డోకా లేకుండా చూసుకుంటున్నారు.

Similar News

News November 5, 2025

HYD: డ్రంక్‌ & డ్రైవ్‌లో దొరికి PS ముందే సూసైడ్

image

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News November 3, 2025

రంగారెడ్డి: ప్రజావాణికి 25 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, DRO సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఈ రోజు ఉదయం RR జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రజావాణికి 25 ఫిర్యాదులు రాగా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు.

News November 2, 2025

రంగారెడ్డి: ‘స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు చేసుకోండి’

image

ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం ద్వారా ఎస్సీ విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తారని రంగారెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రామారావు తెలిపారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉండాలని సూచించారు.