News January 6, 2025
కూడేరు: రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపిన దున్నపోతు

కూడేరు మండలంలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. అమ్మవారికి విడిచిన దున్నపోతు తమదంటే తమదని కడదరకుండ, ముద్దలాపురం గ్రామ ప్రజలు వాదనలకు దిగారు. అయితే ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారి సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరింది. దీంతో ఇరు గ్రామాల వారు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
Similar News
News October 19, 2025
యాడికి: 11 మందిపై కేసు నమోదు

యాడికి మండలానికి చెందిన మహిళపై ఈనెల 4న అదే మండలానికి చెందిన విశ్వనాథ్ బలాత్కారం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. 8న విశ్వనాథ్ తన సోదరులు, బంధువులతో బాధితురాలి ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపించింది. దాడిలో బాధితురాలి భర్త నారాయణస్వామి, కొడుకు నవీన్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది. ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేని, బాధితులు శనివారం డీఐజీని ఆశ్రయించడంతో పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారన్నారు.
News October 18, 2025
2 నియోజకవర్గాలలో అరాచక పాలన: తోపుదుర్తి

రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలో అరాచక పాలన జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి మాట్లాడారు. MLA పరిటాల సునీత పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వానికి లేఖ రాసి 50 వేల ఇళ్ల నిర్మాణాలు ఆపారన్నారు. MLA సునీత, పరిటాల శ్రీరామ్ చేనేతల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
News October 17, 2025
2 నియోజకవర్గాలలో అరాచక పాలన: తోపుదుర్తి

రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలో అరాచక పాలన జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి మాట్లాడారు. MLA పరిటాల సునీత పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వానికి లేఖ రాసి 50 వేల ఇళ్ల నిర్మాణాలు ఆపారన్నారు. MLA సునీత, పరిటాల శ్రీరామ్ చేనేతల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.