News January 7, 2025
HYD: భారీగా పట్టుబడ్డ నకిలీ పన్నీరు

హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసరి ఎంక్లేవ్లో నకిలీ పన్నీరు భారీ మొత్తంలో పట్టుబడింది. విశ్వసనీయ సమాచారంతో నకిలీ పన్నీరు తయారు కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. నిందితులను పట్టుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. అక్కడ సుమారు 600 కిలోల పన్నీరు, కొన్ని రకాల కెమికల్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేగం బజార్కు చెందిన ఓ వ్యాపారి దీన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.
Similar News
News January 8, 2026
తలకొండపల్లి: రేపటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

తలకొండపల్లి మండలం వెల్జాల్లో వెలసిన వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీనివాసమూర్తి చెప్పారు. ఉత్సవాలలో భాగంగా 9న గణపతి పూజ, లక్ష్మీనరసింహస్వామి అభిషేకం, లక్ష పుష్పార్చన, 10న పుష్పార్చన, అభిషేకం, బండ్లు తిరుగుట, 11న మధ్యాహ్నం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, చక్రతీర్థం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News January 8, 2026
రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్-2 మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్

నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్న వ్యక్తులకు సహకరించిన రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2 కె.మధుసూధన్ రెడ్డిని రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. అంతే కాదు.. మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దీన్ని సీరియస్గా తీసుకున్నారు.
News January 6, 2026
రంగారెడ్డిలో ‘పేదోడి విందు’ కొండెక్కింది

పేదోడి విందైన చికెన్ ధర కొండెక్కడంతో RRజిల్లాలో చికెన్ ప్రియులకు షాక్ తగిలి బెంబేలు ఎత్తుతున్నారు. న్యూ ఇయర్ ప్రారంభంలోనే కిలో చికెన్ ధర త్రిబుల్ సెంచరీకి చేరింది. గత కొన్ని రోజులుగా రూ.200- 250 ఉన్న ధర అమాంతం పెరగడంతో వచ్చే పండుగ ఎలా చేసుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఫారం ధర రూ.180 పలుకుతోంది. వినియోగం పెరిగి, కోళ్ల పెంపకం తగ్గడమే ధర పెరగుదలకు కారణమని ఫారం యజమానులు చెబుతున్నారు.


