News January 7, 2025

HYDలో భారీగా పెరిగిన ఓటర్లు

image

రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటరు జాబితాను విడుదలైంది. రంగారెడ్డి, HYD, మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 1.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధికంగా 7.65 లక్షల మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా.. 2.32 లక్షలమంది ఓటర్లతో చివరి స్థానంలో చార్మినార్ ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 2, 2026

HYD: ‘మీ సోకు మేం క్యాష్ చేస్కుంటాం’

image

ధరల పెంపుతో ​స్మోకర్స్‌కు ముందే ‘పొగ’ పెడుతున్నారు వ్యాపారులు. సిగరెట్లపై 40% పన్ను పెంచుతున్నట్లు కేంద్రం చెప్పడమే లేట్ నగరంలో నోస్టాక్ అంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్యాకెట్‌‌పై‌ ₹10 సింగిల్‌గా ₹2 ఎక్స్‌ట్రా గుంజుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ముందే వ్యాపారుల దోపిడీతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంటే ఎవరిని ప్రశ్నించాలని వాపోతున్నారు. వాస్తవంగా పెరిగిన ధరలు FEB-1 నుంచి అమల్లోకి రావాలి.

News January 2, 2026

మూసీ పరివాహకంలో నైట్ ఎకానమీ అభివృద్ధి: సీఎం

image

మూసీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు మూసీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు CM అసెంబ్లీలో తెలిపారు. దీంట్లో నష్టపోయే స్థానికులకు బ్రహ్మాండమైన కాలనీ కట్టిస్తామన్నారు. అంతర్జాతీయ కన్సల్టెన్సీని పెట్టుకున్నామని, DPR వచ్చేవరకు ప్రజెక్టు అంచనా చెప్పమని హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. ప్రజెక్టు వద్దన్నోళ్లు అంబర్‌పేట్ శ్మాశానవాటిక వద్ద ఒకరాత్రి ఉండి దుర్భరస్థితిని చూడాలన్నారు.

News January 2, 2026

HYD: సమ్మర్‌లో కరెంట్ కష్టాలకు చెక్!

image

వేసవి కాలంలో ఉక్కపోతతో నగరంలో అధికంగా ఏసీలు, ఫ్యాన్లు వినియోగిస్తారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ కోతలూ ఉంటాయి. ఈ సారి కోతలకు చెక్ పెట్టాలని విద్యుత్‌శాఖ చూస్తోంది. మహానగర వ్యాప్తంగా 20 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వేసవి కాలానికి ముందే వీటిని ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.