News January 7, 2025
NRPT: స్కూల్కి వెళ్లమంటే ఉరేసుకున్నాడు

నారాయణపేట మండలం పెరపళ్లకి చెందిన <<15077017>>బాలుడు<<>> ఆంజనేయులు(15) ఉరేసుకున్న విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన శ్రీనివాస్, బుగ్గమ్మ దంపతుల పెద్దకొడుకు ఆంజనేయులు 7వ తరగతి వరకు చదివి పొలం పనులు చేస్తూ, గొర్రెలు కాస్తున్నాడు. చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. నిన్న ఉదయం శాసన్పల్లి శివారులో చెట్టుకు ఊరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 9, 2025
చౌక ధర దుకాణాలను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని షాప్ నంబర్ 34లో డీలర్ కాకుండా మరొక వ్యక్తితో షాపును నడిపిస్తున్న కారణంగా ఆయనకు షోకేస్ నోటీసు ఇవ్వాలని అర్బన్ తహశీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ దుకాణాలు సమయానికి అనుగుణంగా ఉదయం సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉండాలని ఆదేశించారు.
News November 9, 2025
MBNR: తుప్పు పట్టిన 104 అంబులెన్స్లు

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో దాదాపు ఆరు 104 అంబులెన్స్లు నిలుచున్న తోనే తుప్పు పట్టి తూట్లు పడుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువస్తే కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదని ప్రజలు అంటున్నారు. డీఎంహెచ్వో కృష్ణయ్యను Way2News వివరణ అడగగా.. ఆ వాహనాలు వేలం కోసం ఉన్నాయని, వేలంలో అమ్ముతామని తెలిపారు.
News November 9, 2025
MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

మహబూబ్నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్, రాజాపూర్ గండేడ్ మండలాలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అన్నారు.


