News March 17, 2024
నిజామాబాద్, కామారెడ్డిలో ప్రజావాణి రద్దు

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు జి.వి పాటిల్, రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆయా కలెక్టర్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, ఎన్నికల తర్వాత యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు సహకరించాలని సూచించారు.
Similar News
News January 27, 2026
NZB: 93 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 93 మందికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసా పత్రాలను అందజేశారు. ట్రాఫిక్ ACP మస్తాన్ అలీ, CI శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, భిక్షపతి తదితరులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన SIలు, HCలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, సిబ్బంది అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు.
News January 27, 2026
NZB: యాసంగిలో 5.33 లక్షల ఎకరాల సాగు అంచనా: కలెక్టర్

2025-26 యాసంగి సీజనులో 5.33 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇప్పటి వరకు వరి 3.36 లక్షల ఎకరాలు, శనగ 14 వేల ఎకరాలు, మొక్క జొన్న 32 వేల ఎకరాలు, ఎర్ర జొన్న 21 వేల ఎకరాల్లో మొత్తం 4.10 లక్షల ఎకరాలలో వివిధ పంటలు రైతులు సాగు చేసినట్లు చెప్పారు. వీటి కోసం 1,03,650 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగిందని ఆమె వివరించారు.
News January 27, 2026
NZB: 115 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 115 మందికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా అధికారులు సాయ గౌడ్(DRDA), శ్రీనివాసరావు(DPO), అరవింద్ రెడ్డి (డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయ్ అధికారి) అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


