News January 7, 2025
ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషి చేస్తా: AICC సెక్రెటరీ

AICC సెక్రెటరీ సంపత్ కుమార్ను మంద కృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించాలని సంపత్ని కోరారు. చేవెళ్ల డిక్లేరేషన్, అసెంబ్లీలో CM రేవంత్ చేసిన ప్రకటనకు అనుగుణంగా వర్గీకరణను త్వరగా అమల్లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. వేల గొంతులు-లక్షల డప్పుల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. వర్గీకరణ పూర్తవడానికి తన వంతు కృషి చేస్తానని సంపత్ హామీ ఇచ్చారని కృష్ణ తెలిపారు.
Similar News
News November 5, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్లో దొరికి PS ముందే సూసైడ్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 3, 2025
రంగారెడ్డి: ప్రజావాణికి 25 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, DRO సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఈ రోజు ఉదయం RR జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రజావాణికి 25 ఫిర్యాదులు రాగా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు.
News November 2, 2025
రంగారెడ్డి: ‘స్కాలర్షిప్నకు దరఖాస్తులు చేసుకోండి’

ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఎస్సీ విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తారని రంగారెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రామారావు తెలిపారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉండాలని సూచించారు.


