News January 7, 2025
91 లక్షల మందికి ఫ్రీ సిలిండర్లు అందజేత: టీడీపీ

AP: ‘దీపం-2’ పథకం కింద ఇప్పటివరకూ 91 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేసినట్లు టీడీపీ వెల్లడించింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1.55కోట్లుగా పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31లోపు ఎప్పుడైనా సిలిండర్ను బుక్ చేసుకుని మొదటి ఉచిత సిలిండర్ను పొందవచ్చని తెలిపింది. 48 గంటల్లోనే సిలిండర్ డబ్బుల్ని జమ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 26, 2026
ఇలా చేస్తే.. జాతరలో తప్పిపోరు!

మేడారం మహా జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇంతటి భారీ జనసమూహంలో పిల్లలు, వృద్ధులు తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే ముందస్తు జాగ్రత్తగా వారి చేతిపై లేదా జేబులో ఫోన్ నంబర్, ఊరి పేరు రాసి ఉంచాలి. స్నానాలు చేసినా చెరిగిపోవద్దంటే జాతరకు వెళ్లే ముందురోజే కోన్ (గోరింటాకు)తో రాయండి. పోలీసుల QR రిస్ట్ బ్యాండ్లతో పాటు ఈ చిన్న చిట్కా మీ ఆత్మీయులను క్షేమంగా ఉంచుతుంది. SHARE IT
News January 26, 2026
ICMRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<
News January 26, 2026
వేరుశనగకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ రికార్డు స్థాయి ధర పలుకుతోంది. TGలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం వేరుశనగకు రూ.12,009 రికార్డు స్థాయి ధర లభించింది. వనపర్తిలో క్వింటాకు రూ.12,002.. అచ్చంపేటలో క్వింటాకు రూ.11,877 ధర లభించింది. వేరుశనగకు ప్రస్తుతం క్వింటాకు రూ.6 వేలు- రూ.10వేలకు పైగా ధర పలుకుతోంది. తమ పంటకు పెరుగుతున్న డిమాండ్ చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


