News March 17, 2024
ఏపీ, తెలంగాణలో మోదీ బిజీబిజీ
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న నాగర్కర్నూల్ విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన రాత్రి HYDలోని రాజ్భవన్లో బస చేశారు. ఇవాళ సాయంత్రం మోదీ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఏపీలోని గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన చిలకలూరిపేటలో నిర్వహించే ప్రజాగళం సభకు హాజరవుతారు. తిరిగి రాత్రికి HYD చేరుకుంటారు. రేపు జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Similar News
News September 29, 2024
స్వీయ వివాహం చేసుకున్న యువతి ఆత్మహత్య
గత ఏడాది తనను తానే వివాహం(Sologamy) చేసుకుని తుర్కియేలో సంచలనం సృష్టించిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కుబ్రా ఐకుట్(26) ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్కు కొన్ని గంటల ముందు ఆమె టిక్టాక్లో చేసిన పోస్టు ప్రస్తుతం వైరలవుతోంది. ‘ప్రతి రోజూ KG చొప్పున బరువు తగ్గిపోతున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. త్వరగా నేను బరువు పెరగాలి’ అని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 29, 2024
కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బ్రూక్
ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదరగొట్టారు. వరుసగా 39, 4, 110*, 87, 72(మొత్తం 312) పరుగులు చేశారు. ఈ క్రమంలో ద్వైపాక్షిక సిరీస్లో ఆసీస్పై అత్యధిక పరుగులు(310) చేసిన కెప్టెన్గా కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టారు. ఆ జట్టుపై ఓ సిరీస్లో ధోనీ 285, మోర్గాన్ 278, బాబర్ 276, డివిలియర్స్ 271, ఆండ్రూ స్ట్రాస్ 267 రన్స్ చేశారు.
News September 29, 2024
రేపు, ఎల్లుండి మూసీ పరీవాహకంలో కేటీఆర్ పర్యటన
TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 72 గంటల తర్వాత జ్వరం తగ్గిందని.. సోమ, మంగళవారాల్లో రాజేంద్రనగర్, అంబర్పేట నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తానని తెలిపారు. బుల్డోజర్ బెదిరింపులను సాధ్యమైనంత వరకు అరికట్టాలని, దాని కోసం తాము చేయగలిగినంత వరకు చేస్తామని పేర్కొన్నారు.