News January 7, 2025
సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 16 వరకు వరుసగా 6 రోజులు హాలిడేస్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అటు ఏపీలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
Similar News
News August 28, 2025
US స్టూడెంట్ వీసా నాలుగేళ్లకే పరిమితం!

US వీసాలు దుర్వినియోగం కాకుండా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలకు సిద్ధమైంది. స్టూడెంట్(F), ఎక్స్చేంజ్(J) వీసాలను ఇక నుంచి నాలుగేళ్లకే పరిమితం చేయాలని ప్రతిపాదించింది. ఓపెన్ ఎండెడ్ రూల్ వల్ల చాలామంది USలోనే ఉండిపోతున్నారని పేర్కొంది. కొత్త రూల్తో ఆ వీలుండదని తెలిపింది. మరోవైపు ఇతర దేశస్థుల జర్నలిస్ట్ వీసా(I)లను 240 రోజులు, చైనా జర్నలిస్ట్ వీసాలను 90 రోజులకే కుదించాలని ప్రపోజ్ చేసింది.
News August 28, 2025
2038 నాటికి రెండో అతిపెద్ద ఎకానమీగా భారత్!

భారత్ పర్చేసింగ్ పవర్ పారిటీ(PPP) టర్మ్స్ పరంగా 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎకానమీగా ఎదగొచ్చని EY రిపోర్ట్ అంచనా వేసింది. $34.2 ట్రిలియన్ల GDP నమోదు చేయొచ్చని పేర్కొంది. దేశ జనాభా సగటు వయసు 28.8 ఏళ్లు, రెండో అత్యధిక సేవింగ్స్ రేట్, ప్రభుత్వ అప్పులు-GDP రేషియో తగ్గుదల తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. చైనా 2030కి $42.2 ట్రిలియన్లతో లీడింగ్లో ఉన్నా వృద్ధ జనాభా దానికి అడ్డంకి అవుతుందంది.
News August 28, 2025
ఈ ప్రత్యేకమైన గణనాథుడి గురించి తెలుసా?

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాలజ్ గ్రామంలో కర్రతో చేసిన సత్య గణేశుడిని పూజిస్తారు. వినాయక చవితి రోజు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజులు ఉత్సవాలు చేస్తారు. చివరి రోజు ఊరేగించి, నీళ్లు చల్లి ఆలయంలోని గదిలో భద్రపరుస్తారు. 1948లో పాలజ్లో కలరా, ప్లేగు వ్యాధులతో చాలా మంది చనిపోవడంతో కర్ర గణపతిని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.