News March 17, 2024

జనగామ: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

image

రైలుపై నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన జనగామ సమీపంలోని యశ్వంతాపూర్ వాగు వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల ప్రకారం.. ఘన్పూర్ మండలం కర్కపల్లికి చెందిన అంబాల వంశీ (21) సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట వైపునకు వెళ్లే రైలులో ప్రయాణిస్తుండగా జారి కిందపడి మృతి చెందాడు. మృతదేహం గుర్తుపట్టనంతగా నుజ్జునుజ్జు అయ్యింది.  

Similar News

News April 9, 2025

వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

image

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

News April 9, 2025

భూపాలపల్లి: పెళ్లి కావట్లేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావట్లేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిట్యాల మండలం వెంచరామికి చెందిన లక్ష్మణ్(28) ట్రాక్టర్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. తన అమ్మానాన్న చనిపోవడంతో చిన్నమ్మ వద్ద ఉంటున్నాడు. తన కంటే చిన్నవాళ్లకు పెళ్లవుతుందని మనస్తాపంతో పురుగుమందు తాగాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. లక్ష్మణ్ చిన్నమ్మ కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 9, 2025

వరంగల్‌లో CONGRESS VS BRS

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRS నేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

error: Content is protected !!