News January 7, 2025

అంద‌రూ వెళ్లిపోయారు.. కానీ మోదీ ఆట ఇంకా న‌డుస్తోంది: బీజేపీ

image

2014 నుంచి ఇప్ప‌టి దాకా ప‌లు దేశాల అధ్య‌క్షులు, ప్ర‌ధానులు ఓడినవారు కొంద‌రైతే, వివిధ కార‌ణాల‌తో త‌ప్పుకున్నవారు ఇంకొందరు. ఇలా మోదీ భార‌త ప్ర‌ధానిగా బాధ్య‌తలు చేప‌ట్టాక US మొద‌లుకొని ఆస్ట్రేలియా వ‌ర‌కు ఎంద‌రో దేశాధినేత‌లు ప‌ద‌వుల నుంచి త‌ప్పుకున్నారు. తాజాగా కెన‌డా PM జస్టిన్ ట్రూడో కూడా. దీంతో ‘అంద‌రూ వెళ్లిపోయారు, కానీ PM మోదీ ఆట ఇంకా న‌డుస్తోంది. Ultimate Big Boss Energy!’ అంటూ BJP పేర్కొంది.

Similar News

News August 27, 2025

ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News August 27, 2025

గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

image

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.

News August 27, 2025

అర్హులెవరికీ అన్యాయం జరగదు: చంద్రబాబు

image

AP: అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని పార్టీ యంత్రాంగానికి CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రూ.500ల దివ్యాంగుల పెన్షన్‌ రూ.6 వేలు చేశాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. ప్రజలకు ఎంతో చేస్తున్నాం. చేసింది చెప్పుకుందాం. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.