News January 8, 2025
ప్రధానికి కృతజ్ఞతలు: శర్మిష్ట ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్మారకచిహ్నం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి తన కృతజ్ఞతల్ని తెలియజేశానని ఆమె ట్విటర్లో తెలిపారు. ‘నా మనస్ఫూర్తిగా పీఎంకు ధన్యవాదాలు. మేం అడగకపోయినా ప్రభుత్వం ఈ గౌరవం ఇవ్వడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఏ మాత్రం ఊహించలేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News August 27, 2025
రోహిత్కు బౌలింగ్ వేయడం కష్టం: వుడ్

తాను ఎదుర్కొన్న కష్టతరమైన బ్యాటర్ రోహిత్ శర్మ అని ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వెల్లడించారు. ‘రోహిత్ శర్మ షార్ట్ బాల్ ఆడటాన్ని ఇష్టపడతారు. అది అతనికి బలహీనత కూడా అయినప్పటికీ తనదైన రోజున బంతుల్ని బౌండరీలకు తరలిస్తారు. అతడి ఆటను చూస్తే బ్యాట్ పెద్దగా, వెడల్పుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కోహ్లీ, పంత్కు బౌలింగ్ చేయడం కూడా సవాలే. పంత్ అసాధారణమైన షాట్లు ఆడుతుంటారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News August 27, 2025
భారీగా వరదలు.. నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం: కేటీఆర్

TG: భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని KTR డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, వెంటనే స్పందించాలన్నారు. గతంలో KCR స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం వైఫల్యం చెందితే BRS కార్యకర్తలు ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
News August 27, 2025
దమ్ముంటే ఆ వ్యాఖ్యలు రిపీట్ చేయండి: స్టాలిన్కు BJP సవాల్

తమిళనాడు CM, DMK చీఫ్ స్టాలిన్ ఇవాళ బిహార్లో పర్యటించడంపై BJP ఫైరైంది. గతంలో DMK నేతలు చేసిన యాంటీ బిహార్, యాంటీ సనాతన కామెంట్స్ను గుర్తు చేస్తూ స్టాలిన్కు సవాల్ విసిరింది. ‘సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని మీ కొడుకు ఉదయనిధి గతంలో అన్నారు. బిహారీలు TNలో టాయిలెట్స్ కడుగుతారని మీ బంధువు, DMK MP దయానిధి కామెంట్ చేశారు. మీకు దమ్ముంటే వాటిని రిపీట్ చేయండి’ అని ఛాలెంజ్ చేసింది.