News January 8, 2025
కేంద్ర రైల్వేశాఖ మంత్రితో ఎంపీ అర్వింద్ భేటీ

NZB ఎంపీ ధర్మపురి అరవింద్, జేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం దిల్లీలో కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన రైల్వే లైన్ విస్తరణ పనుల గురించి చర్చించారు. ARMR to ADB వయా నిర్మల్ రైల్వే లైన్ గురించి ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
Similar News
News September 18, 2025
NZB: ఎస్ఆర్ఎస్పీ కాలువలో వృద్ధురాలి శవం

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
NZB: ఎస్ఆర్ఎస్పీ కాలువలో వృద్ధురాలి శవం

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
TU: RSS ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం

తెలంగాణ యూనివర్సిటీ RSS శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో విజయదశమి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య వక్తగా డా.కాపర్తి గురుచరణం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విజయదశమి ఉత్సవమనేది విజయానికి ప్రతీక అన్నారు. అటు RSS 100సం.రాలలో సాధించిన విజయాలను గురించి వివరించారు. కార్యక్రమంలో ఖండ సహా కర్యవహ సంతోష్, సాంగు,మధు,శ్రవణ్, దిగంబర్,రమణ తదితరులున్నారు.