News March 17, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

*వివిధ శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
*ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
*ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
*అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
*బయ్యారం మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
*కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
*పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
Similar News
News March 12, 2026
ఖమ్మం: విద్యుత్ ఫిర్యాదులకు ‘వాట్సాప్’ పరిష్కారం

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. NPDCL ప్రత్యేకంగా వాట్సాప్ చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 79016 28348 నంబర్కు Hi అని సందేశం పంపి, మీ సర్వీస్ నంబర్ ద్వారా ఇంట్లోనే ఉండి ఫిర్యాదు చేయవచ్చు. సమస్య పరిష్కారమయ్యాక IVRS ద్వారా నిర్ధారణ చేసుకునే పారదర్శక విధానం కల్పించారు. అత్యవసరసమయాల్లో 1912కు కాల్ చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.
News March 12, 2026
ఖమ్మం: తీరిన గ్యాస్ గండం.. భోజన కష్టాలు దూరం

యుద్ధ ప్రభావంతో గ్యాస్ ఏజెన్సీలు సరఫరా నిలిపివేయడంతో జిల్లాలోని హాస్టళ్లలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. సిలిండర్ల కొరతతో భోజన తయారీకి ఇబ్బందులు ఎదురవ్వగా.. అ.కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించి, వసతి గృహాలకు నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల భోజనానికి ఆటంకం తొలగిందని, ముందస్తు నిల్వలు పెంచుతున్నామని DBCDO జ్యోతి తెలిపారు.
News March 11, 2026
ఖమ్మం: టెన్త్ పరీక్షలకు 98 కేంద్రాలు ఏర్పాటు

ఈనెల 14న ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షల కోసం అధికారులు జిల్లావ్యాప్తంగా 98 కేంద్రాలను ఎంపిక చేశారు. అత్యధికంగా ఖమ్మం నగరంలోనే కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా మండలాల్లో కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ ఏడాది పరీక్షలకు 16,975 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6 ఫ్లయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేయగా, ప్రతి ఫ్లయింగ్ స్కాడ్లో డిప్యూటీ తహశీల్దార్, ఎస్ఐ సభ్యులుగా ఉండనున్నారు.


