News March 17, 2024

కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి ED సమన్లు

image

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. కాగా.. లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయనకు సమన్లు పంపించడం ఇది తొమ్మిదోసారి. కానీ, ఒక్కసారి కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ కోర్టుకు వెళ్లగా.. ఆయన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుకావాల్సి వచ్చింది. అక్కడా ఆయన నిన్న బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి సమన్లు ఇచ్చింది.

Similar News

News September 29, 2024

కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బ్రూక్

image

ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదరగొట్టారు. వరుసగా 39, 4, 110*, 87, 72(మొత్తం 312) పరుగులు చేశారు. ఈ క్రమంలో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆసీస్‌పై అత్యధిక పరుగులు(310) చేసిన కెప్టెన్‌గా కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టారు. ఆ జట్టుపై ఓ సిరీస్‌లో ధోనీ 285, మోర్గాన్ 278, బాబర్ 276, డివిలియర్స్ 271, ఆండ్రూ స్ట్రాస్ 267 రన్స్ చేశారు.

News September 29, 2024

రేపు, ఎల్లుండి మూసీ పరీవాహకంలో కేటీఆర్ పర్యటన

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 72 గంటల తర్వాత జ్వరం తగ్గిందని.. సోమ, మంగళవారాల్లో రాజేంద్రనగర్, అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తానని తెలిపారు. బుల్డోజర్ బెదిరింపులను సాధ్యమైనంత వరకు అరికట్టాలని, దాని కోసం తాము చేయగలిగినంత వరకు చేస్తామని పేర్కొన్నారు.

News September 29, 2024

వీరోచితం: చనిపోయే ముందు ఉగ్రవాదిని అంతం చేశాడు!

image

తాను చనిపోయే స్థితిలో ఉన్నా కనీసం ఒక్క ఉగ్రవాదినైనా వెంట తీసుకుపోవాలనుకున్నారాయన. తూటా దెబ్బకి ఒళ్లంతా రక్తమోడుతున్నా ఓ ముష్కరుడిని హతమార్చాకే కన్నుమూశారు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్‌దీ వీరగాథ. మండ్లీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరవీరుడైన బషీర్‌కు రాష్ట్ర పోలీసు శాఖ ఘన నివాళులర్పించింది.