News January 8, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,566 మంది దర్శించుకోగా, 16,021 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.2కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు, తిరుమల నుంచి మహాకుంభమేళా జరుగుతున్న యూపీలోని ప్రయాగ్రాజ్కు శ్రీవారి రథం బయల్దేరింది.
Similar News
News February 11, 2026
ఎగ్జిట్ పోల్స్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే హవా

TG మున్సిపల్ ఎన్నికల్లో 7కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, MBNR, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. NZB, KRNను BJP దక్కించుకుంటుందని, BRS ఒక్క కార్పొరేషన్నూ సొంతం చేసుకోలేదని పేర్కొంది. 116మున్సిపాలిటీల్లో INC 68-76, BRS 29-36, BJP 3-5, MIM 0-1, ఇతరులు 8-14 దక్కించుకుంటారని పేర్కొంది. పూర్తి వివరాలు పైన స్లైడ్స్లో చూడవచ్చు.
News February 11, 2026
151 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)151 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిప్లొమా, ఇంటర్, టెన్త్, ITI అర్హత గలవారు నేటి నుంచి FEB 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.21,000-23,000తో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. సైట్: https://hal-india.co.in
News February 11, 2026
అంకితభావంతో పనిచేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది!

ఇండోర్(MP) మున్సిపల్ కమిషనర్గా IAS అధికారి అశీష్ సింగ్ అద్భుతం చేశారు. 2018లో 6 నెలల్లో 13 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించి రూ.400కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. అద్దె యంత్రాలు వాడటంతో ₹65 కోట్ల ఖర్చును ₹10 కోట్లకు తగ్గించారు. ఆయన చూపిన పాలనా దక్షతతోనే ఇండోర్ నేడు దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వెలుగొందుతోంది. ఇలాంటి అంకితభావం కలిగిన అధికారులే దేశానికి అవసరం. ఏమంటారు?


