News January 8, 2025
KTRలో భయం మొదలైంది: మహేశ్ కుమార్

KTRలో భయం మొదలయ్యిందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డిచ్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్నటి దాకా దమ్ముంటే అరెస్ట్ చేయండి.. జైలుకు వెళ్తా అని బీరాలు పలికిన KTR ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏసీబీ కేసు కొట్టివేయాలని KTR హైకోర్టును ఆశ్రయిస్తే పిటిషన్ కొట్టివేయడంతో ఆయనలో భయం మొదలైందన్నారు.
Similar News
News January 21, 2026
NZB: రెడ్ క్రాస్లో డే కేర్ సెంటర్ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సమన్వయంతో నిజామాబాద్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ భవనంలో ఏర్పాటు చేసిన ‘ప్రణాం వృద్ధుల డే కేర్ సెంటర్’ను ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA సుదర్శన్ రెడ్డి, NZB కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షురాలు ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ప్రారంభించారు. వృద్ధుల జీవన విధానం కల్పించడమే ఈ ప్రణాం డే కేర్ సెంటర్ ప్రధాన లక్ష్యమని సుదర్శన్ రెడ్డి అన్నారు.
News January 21, 2026
NZB: 1931లో మున్సిపాలిటీ.. 2005లో కార్పొరేషన్

NZB మున్సిపాలిటీ 1931 సంవత్సరంలో ఏర్పడింది. 1987లో దీన్ని ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా అప్గ్రేడ్ చేశారు. 2005 మార్చి 5న ప్రభుత్వం జారీ చేసిన GO No.109 ప్రకారం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్గా మారింది. ప్రస్తుతం ఇది నిజామాబాద్ నగరపాలక సంస్థ పేరుతో 60 వార్డులతో పరిపాలన కొనసాగిస్తోంది.
News January 21, 2026
నిజామాబాద్లో మున్సిపల్ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే

నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 39, 40, 44 వార్డుల రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ ఖరారులో నిబంధనలు పాటించలేదని పి.లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి మూడు రోజుల్లోగా రిజర్వేషన్లను పునఃపరిశీలించాలని కలెక్టర్ను ఆదేశించారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా పడింది


