News January 8, 2025

ఒకరి మృతి.. అస్సాంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

image

అస్సాం దిమా హసావా జిల్లాలోని కోల్‌మైన్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నెల 6న గనిలోకి ఒక్కసారిగా నీరు చేరడంతో కార్మికులు కేకలేస్తూ బయటికి వచ్చారు. మైన్‌లో చిక్కుకుపోయిన వారిలో ఒకరి మృతదేహాన్ని నేడు వెలికి తీయగా మరో 8మంది కోసం గాలిస్తున్నారు. అయితే మైన్‌లో 15-16 మంది చిక్కుకున్నట్లు అక్కడ పనిచేసే ఓ మైనర్ చెప్పాడు. ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర CM బిశ్వ‌శర్మ ఆదేశించారు.

Similar News

News January 26, 2026

TET ఫలితాలు.. కీలక అప్‌డేట్

image

TG: TET ఫలితాల్లో ఈసారి నార్మలైజేషన్ ప్రక్రియ ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఒకే సెషన్‌‌లో, ఒకే రకమైన క్వశ్చన్ పేపర్‌తో పరీక్షలు జరగడంతో నార్మలైజేషన్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్‌లోనూ ఈ అంశాన్ని పేర్కొనలేదు. కాగా 2 సెషన్లలో పరీక్షలు జరిగితే ఒక సెషన్ పేపర్ కఠినంగా, మరో సెషన్‌లో సులువుగా వచ్చే ఛాన్సుంటుంది. అలాంటి సందర్భాల్లో నార్మలైజేషన్ అమలు చేస్తారు.

News January 26, 2026

10వేల కిలోల పేలుడు పదార్థాలు.. రిపబ్లిక్ డే వేళ కలకలం

image

రిపబ్లిక్ డే ముందు రాత్రి రాజస్థాన్‌లో భారీగా పేలుడు <<18942074>>పదార్థాలు<<>> పట్టుబడటం కలకలం రేపింది. నాగౌర్(D) హార్సౌర్‌‌‌లోని ఫామ్‌హౌజ్‌లో పోలీసులు 10వేల KGs అమ్మోనియం నైట్రేట్ బ్యాగులు, డిటోనేటర్లు గుర్తించారు. సులేమాన్ ఖాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాటిని ఎందుకు నిల్వ చేశాడు? క్రిమినల్ హిస్టరీ ఉన్న అతడికి ఇతర రాష్ట్రాల వారితో లింక్‌లు ఉన్నాయా? అనే కోణంలో ఇంటరాగేట్ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

News January 26, 2026

భీష్మాష్టమి పూజా విధానం

image

ఈ పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. శాంతికి చిహ్నమైన తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించాలి. విష్ణుమూర్తిని తామర పూలు, తులసి దళాలతో అర్చించాలి. పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఉపవాసం ఉండాలి. జాగరణ చేయాలి. తామర వత్తులతో దీపారాధన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణంతో ఇంటికి శుభం కలుగుతుంది. పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం అందించడం ఎంతో శ్రేష్ఠం.