News January 8, 2025
పిల్లలొద్దు.. పెట్సే ముద్దంటున్నారు!

ఇండియాలో జననాల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో మార్స్ పెట్కేర్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండియాలో జనరేషన్ Z& మిలీనియల్స్కు చెందిన 66శాతం మంది పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. వీరు ‘పెట్ పేరెంటింగ్’ను స్వీకరించడంతో జంతువుల సంరక్షణ పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు పేర్కొంది. పట్టణ జీవితంలో ఒత్తిడి తగ్గించేందుకు ఇదో పరిష్కారంగా భావిస్తున్నారంది.
Similar News
News August 22, 2025
నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ!

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు. మ.2 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 3.15 గంటలకు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ డా.అరవింద్ పనగడియాతో సమావేశమవుతారు. సా.5 గంటలకు వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర సాంకేతికశాఖ కార్యదర్శి అభయ్ కరందికర్ను కలిసి వివిధ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
News August 22, 2025
ఖర్గేను కలిసిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి

AP: వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏకు మద్దతిచ్చిన క్రమంలో ఆయన ఖర్గేను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఖర్గేతో తనకు ఎప్పటినుంచో పరిచయం ఉందని, అందుకే మర్యాదపూర్వకంగా కలిశానని మేడా స్పష్టం చేశారు. దీనిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
News August 22, 2025
చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చిందంటే?

1988లో వచ్చిన మరణమృదంగం సినిమా ముందు వరకూ చిరంజీవిని సుప్రీం హీరో అని పిలిచేవారు. ఈ సినిమా తర్వాత చిరంజీవికి నిర్మాత కేఎస్ రామారావు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి టైటిల్ కార్డ్స్లో చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని పడుతోంది. ఆ తర్వాత నాగబాబును మెగా బ్రదర్, రామ్ చరణ్ను మెగా పవర్ స్టార్, వరుణ్ తేజ్ను మెగా ప్రిన్స్, నిహారికను మెగా డాటర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు.