News January 8, 2025
NETను తొలగించాలని UGC నిర్ణయం?

ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, పదోన్నతులకు తప్పనిసరి అయిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET)ను తొలగించాలని UGC సిఫార్సు చేసింది. స్టాఫ్ నియామకాలకు సంబంధించి డ్రాఫ్ట్ ముసాయిదా నిబంధనలను రిలీజ్ చేసింది. FEB 5లోపు వీటిపై అభిప్రాయాన్ని సమర్పించాలని స్టేక్ హోల్డర్లను కోరింది. కొత్త రూల్స్ ప్రకారం NET రాయకుండానే ME/MTECHలో 55% మార్క్స్ సాధించిన వారు స్టాఫ్ పోస్టులకు అర్హత సాధిస్తారు.
Similar News
News July 9, 2025
HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసింది. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా అదనంగా మరో 10శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని SRH యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో విజిలెన్స్ <<16524630>>రిపోర్టు<<>> ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది.
News July 9, 2025
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

TG: తమ రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని సీఎం రేవంత్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కేంద్ర ఎరువులశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ‘తెలంగాణలో యూరియా కొరత లేకుండా చేస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని జిల్లాలకు యూరియాను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో కాస్త యూరియా వాడకం తగ్గిస్తే భూసారం దెబ్బతినకుండా ఉంటుంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
News July 9, 2025
BRS వల్లే కృష్ణా జలాల్లో TGకి అన్యాయం: మంత్రి ఉత్తమ్

TG: BRS హయాంలోనే రాయలసీమకు కృష్ణా నీటిని అక్రమంగా తరలించే ఏర్పాట్లు జరిగాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘కల్వకుర్తి, నెట్టెంపాడు, SLBC, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను BRS పూర్తి చేయలేదు. కృష్ణా జలాల్లో TGకి 299 TMCలు చాలని KCR ఒప్పుకున్నారు. APకి 512 TMCలు ఇచ్చేందుకు అంగీకరించారు. మా ప్రభుత్వం వచ్చాకే TGకి 578 TMCలు కావాలని అపెక్స్ కౌన్సిల్ను కోరాం’ అని కృష్ణా జలాలపై ప్రజెంటేషన్లో వివరించారు.