News January 8, 2025
11వేల రుద్రాక్షలను ధరించి మహాకుంభమేళాకు వచ్చిన బాబా

మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈక్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, రుషులు, సాధువులు, బాబాలు, అఘోరాలు నదీ స్నానం చేసేందుకు ప్రయాగరాజ్కు వెళ్తున్నారు. అయితే, అక్కడికి వచ్చిన
ఓ రుద్రాక్ష బాబా ఆకట్టుకుంటున్నారు. ఆయన ఏకంగా 30 కేజీల బరువున్న 11వేల రుద్రాక్షలను ధరించారు. తనను ప్రజలు రుద్రాక్ష బాబా అని పిలుస్తారని, చాలాకాలంగా వీటిని ధరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News November 5, 2025
HYD-VJA ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్-విజయవాడ మీదుగా వెళ్లే NH-65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డులో 40-269KM మధ్య 229KM వరకు నాలుగు లేన్ల రోడ్డును ఆరు లేన్లకు పెంచనుంది. ఇందుకోసం భూసేకరణ చేయడానికి AP, TGల్లో అధికారులను నియమించింది. నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, విజయవాడ పరిధిలోని 34 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఈ విస్తరణకు రూ.10వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా.
News November 5, 2025
హనుమకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

TG: ఈ నెల 10 నుంచి 22 వరకు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్మన్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 12న అడ్మిట్ కార్డులు పొందిన వారికే ఈ అవకాశం అని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు 040-27740059కు కాల్ చేయాలని సూచించారు.
News November 5, 2025
మరో 4 కొత్త రెవెన్యూ డివిజన్లు?

AP: నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రెవెన్యూ డివిజన్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరోవైపు కైకలూరు సెగ్మెంట్ను కృష్ణా జిల్లాలో, గన్నవరం, నూజివీడులను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. ఇవాళ వీటిపై చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.


