News January 8, 2025
గవర్నర్కు కిషన్ రెడ్డి ఫిర్యాదు

TG: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో బీజేపీ నాయకులు గాయపడ్డారని, రాజకీయ ప్రత్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అందించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.
Similar News
News January 28, 2026
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. SSD టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 5 గంటలు పడుతోంది. క్యూకాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 77,049 మంది దర్శించుకోగా, 21,469 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చింది. టోకెన్ కలిగిన భక్తులు కేటాయించిన సమయానికే క్యూలోకి రావాలని TTD సూచించింది.
News January 28, 2026
వాట్సాప్లో హై సెక్యూరిటీ ఫీచర్

వాట్సాప్ ‘స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్’ పేరిట హై సెక్యూరిటీ ఫీచర్ను తీసుకొచ్చింది. ఆల్రెడీ యాప్లో డిఫాల్ట్గా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నప్పటికీ అడిషనల్ సెక్యూరిటీ కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ను ఆన్ చేస్తే తెలియని నంబర్ల నుంచి వచ్చే మీడియా ఫైల్స్/అటాచ్మెంట్లు బ్లాక్ అవుతాయి. కాల్స్ మ్యూట్ అవుతాయి(రింగ్ అవ్వదు). ఏదైనా లింక్ వస్తే థంబ్నెయిల్/ప్రివ్యూ డిసేబుల్ అవుతుంది.
News January 28, 2026
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందా?

సాధారణంగా కన్సీవ్ అయినపుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వైద్యులను సంప్రదించాలంటున్నారు నిపుణులు. థైరాయిడ్, షుగర్, బీపీ సమస్యలు ఉంటే వాటి ప్రభావం బిడ్డపై పడుతుంది కాబట్టి వైద్యులు పరీక్షలు చేసి మందులు సూచిస్తారు. అలాగే ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.


