News March 17, 2024

పాకిస్థాన్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

image

పాక్ నుంచి వచ్చిన 18మంది హిందూ శరణార్థులకు గుజరాత్ ప్రభుత్వం భారత పౌరసత్వం ఇచ్చింది. వారంతా కొన్నేళ్లుగా అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే మైనారిటీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వం మంజూరు చేసే అధికారాన్ని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు గతంలోనే కేంద్రం అప్పగించింది. ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో 1,167 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది.

Similar News

News April 1, 2025

శుభ ముహూర్తం (1-04-2025)

image

☛ తిథి: శుక్ల తదియ ఉ.9.54 వరకు
☛ నక్షత్రం: భరణి సా.3.22 వరకు
☛ శుభ సమయం: ఏమీ లేవు
☛ రాహుకాలం: మ.3.00-మ.4.30 వరకు
☛ యమగండం: ఉ.9.00-ఉ.10.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12 వరకు, రా.10.48 నుంచి 11.36 గంటల వరకు ☛ వర్జ్యం: తె.2.34-తె.4.04 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.10.55-మ.12.24 వరకు

News April 1, 2025

TODAY HEADLINES

image

✒ మయన్మార్‌: 2వేలకు చేరిన భూకంప మృతుల సంఖ్య
✒ YCP మంత్రిని బీటెక్ రవి, బీద రవి తన్నారు: లోకేశ్
✒ రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్: నాదెండ్ల
✒ అన్యాయాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?: YS జగన్
✒ గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు
✒ కాకినాడ పోర్టు నుంచి TG బియ్యం ఎగుమతులు
✒ ‘రాజీవ్ యువ వికాసం’ గడువు APR 14 వరకు పొడిగింపు
✒ SRHకు HCA వేధింపులు.. సీఎం రేవంత్ ఆగ్రహం
✒ HCU భూములపై ముదురుతున్న వివాదం

News April 1, 2025

రామ్ చరణ్ ‘పెద్ది’ ఆడియో హక్కుల ధర ఎంతంటే..

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ- ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో మూవీకి మంచి బజ్ నెలకొనగా మూవీ టీమ్ తాజాగా మరో క్రేజీ న్యూస్‌ చెప్పింది. ఏఆర్ రెహమాన్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ రూ.35కోట్లకు దక్కించుకుందని ప్రకటించింది. రెహమాన్-చెర్రీ కాంబోలో ఇదే తొలిమూవీ కావడం విశేషం.

error: Content is protected !!