News January 9, 2025

మైత్రీ మూవీ మేకర్స్‌పై చర్యలు తీసుకోండి: అడ్వకేట్

image

మైత్రీ మూవీ మేకర్స్, జై హనుమాన్ చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ తిరుమలరావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. జై హనుమాన్ మూవీ టీజర్‌లో హనుమంతుడిని కించపరిచేలా సీన్లు ఉన్నాయని ఆరోపించారు. టీజర్‌లో హనుమంతుడికి బదులు రిషబ్ శెట్టి ముఖం చూపించడంతో భవిష్యత్ తరాలకు హనుమాన్ అంటే ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వెంటనే వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News November 5, 2025

HYD-VJA ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్

image

హైదరాబాద్-విజయవాడ మీదుగా వెళ్లే NH-65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డులో 40-269KM మధ్య 229KM వరకు నాలుగు లేన్ల రోడ్డును ఆరు లేన్లకు పెంచనుంది. ఇందుకోసం భూసేకరణ చేయడానికి AP, TGల్లో అధికారులను నియమించింది. నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, విజయవాడ పరిధిలోని 34 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఈ విస్తరణకు రూ.10వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా.

News November 5, 2025

హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

TG: ఈ నెల 10 నుంచి 22 వరకు హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఇందులో ఎన్‌రోల్ చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 12న అడ్మిట్ కార్డులు పొందిన వారికే ఈ అవకాశం అని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు 040-27740059కు కాల్ చేయాలని సూచించారు.

News November 5, 2025

మరో 4 కొత్త రెవెన్యూ డివిజన్లు?

image

AP: నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రెవెన్యూ డివిజన్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరోవైపు కైకలూరు సెగ్మెంట్‌ను కృష్ణా జిల్లాలో, గన్నవరం, నూజివీడులను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. ఇవాళ వీటిపై చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.