News March 17, 2024
ముందుగానే కేంద్రాలకు చేరుకోండి : డీఈఓ

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు ముందు రోజే కేంద్రాలను సరిచూసుకుంటే మంచిదని సూచించారు. అలాగే, పరీక్ష రోజు కేంద్రాలకు హాల్ టికెట్లతో నిర్ణీత సమయానికి కంటే ముందుగా చేరుకోవాలని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని, అవాంచనీయ ఘటనలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 25, 2026
ఖమ్మం: రేపు జాతీయ పతాకం ఆవిష్కరించనున్న కలెక్టర్

ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా కలెక్టర్ అనుదీప్ పాల్గొంటారని జిల్లా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ. 9:30కు కలెక్టర్ ప్రసంగం. 9:50కు సాంస్కృతిక కార్యక్రమాలు. 10:45కు ప్రశంస పత్రాల పంపిణీ అనంతరం కలెక్టర్ స్టాళ్లను సందర్శిస్తారని పేర్కొన్నారు.
News January 25, 2026
కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: శ్యామల

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసులకు కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని, పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె. శ్యామల భరోసా ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించిన ఆమె, ఇటీవల పార్టీ అధినేత జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కేసులు నమోదైన కార్యకర్తలను స్వయంగా పరామర్శించారు. అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం నేరమా? అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.
News January 25, 2026
ఖమ్మంలో జిల్లాలో ప్రశాంతంగా ‘జేఈఈ మెయిన్స్’

ఖమ్మంలో శనివారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు విడతల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 864 మందికి గాను 860 మంది, మధ్యాహ్నం 863 మందికి 856 మంది హాజరైనట్లు సిటీ కోఆర్డినేటర్ ఆర్ పార్వతిరెడ్డి వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.


