News January 9, 2025

పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు

image

AP: తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ పరిశీలించాల్సి ఉంది. అలాగే అనివార్య కారణాల వల్ల మంత్రి నారా లోకేశ్ కర్నూలు పర్యటన కూడా రద్దైనట్లు అధికారులు తెలిపారు. లోకేశ్ ఇవాళ కర్నూలులో పలు కళాశాలల సందర్శనతోపాటు మంత్రి భరత్ కుమార్తె రిసెప్షన్‌ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది.

Similar News

News August 17, 2025

US టీమ్ భారత పర్యటన రద్దు?

image

భారత్-అమెరికా మధ్య ఆరో విడత వాణిజ్య చర్చలను కొనసాగించేందుకు ఈ నెల 25న యూఎస్ బృందం ఢిల్లీ రావాల్సి ఉంది. కానీ యూఎస్ ప్రతినిధుల టూర్ రద్దైనట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతల్లో చర్చలు కొనసాగాయి. చివరి రౌండ్ చర్చలు వాషింగ్టన్‌లో భారత చీఫ్ నెగోషియేటర్ రాజేశ్ అగర్వాల్, యూఎస్ ప్రతినిధి బ్రెండన్ లించ్‌ మధ్య జరిగాయి.

News August 17, 2025

ఆసియా కప్‌కు హర్భజన్ టీమ్ ఇదే

image

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తన జట్టు అంచనాను ప్రకటించారు. ఈ జట్టులో అనూహ్యంగా రియాన్ పరాగ్‌కు చోటు ఇవ్వడం విశేషం. అలాగే సంజూ శాంసన్‌ను పక్కనబెట్టారు. జట్టు: జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిషేక్, గిల్, శ్రేయస్, సూర్య, పంత్, హార్దిక్, సుందర్, పరాగ్, కుల్దీప్, అక్షర్, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్. దీనిపై మీ కామెంట్?

News August 17, 2025

ఆగస్టు 17: చరిత్రలో ఈరోజు

image

1817: అమరావతి సంస్థాన పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మరణం
1866: హైదరాబాద్ ఆరో నవాబు మహబూబ్ అలీ ఖాన్ జననం
1949: తెలుగు గేయ రచయిత భువన చంద్ర జననం
1964: డైరెక్టర్ ఎస్.శంకర్ జననం
1980: రచయిత కొడవటిగంటి కుటుంబరావు మరణం
1993: హీరోయిన్ నిధి అగర్వాల్(ఫొటోలో)జననం
ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం