News January 9, 2025
పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి

HYD మార్కెట్లో 3 రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు కాస్త పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.79,200గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.350 ఎగసి రూ.7,2600కు చేరింది. అటు వెండి ధరలు 2 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.లక్షగా ఉంది.
Similar News
News November 8, 2025
కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో జియోకు 2 ఎకరాలు

TG: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో రిలయన్స్ కంపెనీ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్కు దాదాపు 2 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో ఈ భూమిని ఇచ్చారు. ఆ సంస్థ ఈ భూమిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయనుంది. ప్రభుత్వం కొన్ని షరతులతో జీఓ విడుదల చేసింది. కేంద్ర అటవీ నిబంధనలకు లోబడి ఈ భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
News November 8, 2025
ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

డిజిటల్, ఆన్లైన్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.
News November 8, 2025
ఆ MLAలు ఏం చేస్తున్నట్లు?

AP: CM <<18235116>>తాజా వ్యాఖ్యల<<>>తో ఆ ‘48మంది MLAలు’ ఎవరు? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. నెలలో ఒకట్రెండు రోజుల పాటు పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలోనూ పాల్గొనలేరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగే నేతలు గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నట్లు? అని నిలదీస్తున్నారు. అయితే MLAలపై చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? అని అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.


