News January 9, 2025
కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్

TG: ఫార్ములా-ఈ రేస్ కేసులో KTRను ఏసీబీ విచారిస్తోంది. మధ్యలో లంచ్ విరామం ఇచ్చారు. లంచ్ తర్వాత తిరిగి విచారణ కొనసాగనుంది.
Similar News
News February 3, 2026
మద్యం అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు: పవన్

AP: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుంది. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి’ అని స్పష్టం చేశారు. నిరంతర నిఘా ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
News February 3, 2026
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్

AP: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. FEB 8 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఫ్రీగా లడ్డూలు అందించాలని నిర్ణయించింది. అదే విధంగా క్యూలైన్లలో పాలు, బిస్కెట్లు, అల్పాహారం సైతం పంపిణీ చేయనుంది. భక్తుల సౌకర్యం కోసం మంచినీరు, మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. 14, 15వ తేదీల్లో టోల్ ఫీజు లేకుండా వాహనదారులను అనుమతించనుంది.
News February 3, 2026
పాక్ బాయ్ కాట్.. రూ.2,200కోట్ల నష్టం

T20 WCతో భారత్ మ్యాచ్ను బాయ్ కాట్ చేస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో భారీగా నష్టం కలిగే ఛాన్సుంది. ప్రసార హక్కులు, యాడ్స్ ధరలు, స్పాన్సర్షిప్, టికెట్ల విక్రయాలు తదితరాలు కలుపుకొని రూ.2,200CR వరకు లాస్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు IND-పాక్ బోర్డులకు కలిపి రూ.200CR వరకు నష్టం వాటిల్లొచ్చని చెబుతున్నాయి. ఇది BCCIకి చిన్న విషయమే అయినా పాక్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపనుంది.


