News January 9, 2025
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ

AP: సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరుగుతున్న ఈ భేటీలో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు జారీ చేసే ప్రక్రియలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ జేఈవోలు పాల్గొన్నారు.
Similar News
News February 8, 2026
క్రిష్-4కి బడ్జెట్ సెగ.. హృతిక్ వర్సెస్ ఆదిత్య చోప్రా!

‘క్రిష్ 4’ సినిమా బడ్జెట్ విషయంలో హృతిక్ రోషన్, నిర్మాత ఆదిత్య చోప్రా మధ్య డిఫరెన్సెస్ వచ్చినట్లు టాక్. డెబ్యూ డైరెక్టర్గా ఈ మూవీని హృతిక్ ₹500 కోట్లతో భారీగా ప్లాన్ చేస్తుంటే ఆదిత్య మాత్రం ₹350 కోట్లకే ఫినిష్ చేయాలని కండిషన్ పెట్టారట. దీంతో YRF ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొనే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ సినిమాతో ప్రియాంక బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
News February 8, 2026
‘లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం’

AP: తిరుపతి(D) పుత్తూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న పద్మ అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి భర్త నిరుద్యోగం, అప్పుల భారమే కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో “తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం. లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
News February 8, 2026
జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల బిడ్డకు ఈ సమస్యలు

గర్భంలో ఉన్న శిశువుకి, తల్లి మాయ నుంచి గ్లూకోజ్ ఎక్కువగా అందుతుంటుంది. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి వచ్చే చక్కెర అకస్మాత్తుగా ఆగిపోవడంతో బిడ్డలో చక్కెర మోతాదులు హఠాత్తుగా పడిపోయి చిన్నారి చల్లబడిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, ఫిట్స్ రావడం, సకాలంలో గమనించకపోతే బిడ్డ మృతిచెందే అవకాశాలుంటాయి. కార్డియోమయోపతి, స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


