News January 10, 2025

విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్‌కు అదనంగా నాలుగు కోచ్‌లు

image

విశాఖ- సికింద్రాబాద్ (20833/34)వందే భారత్ రైలుకు అదనంగా నాలుగు కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. జనవరి 11 నుంచి వందే భారత్ రైలు 20 కోచ్‌లతో నడుస్తుందన్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ -2, చైర్ కార్ -18 బోగీలు ఉండనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Similar News

News January 19, 2026

విశాఖ మీదుగా కొత్త ‘అమృత్ భారత్’ రైళ్లు

image

విశాఖ మీదుగా రాకపోకలు సాగించే రెండు కొత్త వీక్లీ ‘అమృత్ భారత్’ రైళ్లను రైల్వే శాఖ ఖరారు చేసింది. (20604/20603) నాగర్‌కోయిల్ – న్యూ జల్‌పాయిగురి నాగర్‌కోయిల్ ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. ట్రైన్ (20610/20609) తిరుచిరాపల్లి -న్యూ జల్‌పాయిగురి – తిరుచిరాపల్లి జనవరి 28 నుంచి ప్రారంభమవుతోంది. ఈ రైళ్లు దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.

News January 19, 2026

జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 57 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 57 వినతులు వచ్చాయి. ఈ వినతులను కమిషనర్ కేతన్ గార్గ్ తీసుకున్నారు. ఇందులో అకౌంట్ విభాగానికి 3, రెవెన్యూ విభాగానికి 4, ప్రజారోగ్యం విభాగానికి 4, పట్టణ ప్రణాళిక విభాగానికి 30, ఇంజినీరింగు విభాగానికి 15, మొక్కల విభాగానికి ఒకటి వచ్చిందన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News January 19, 2026

విశాఖలో రెవెన్యూ క్లినిక్‌కు 63 అర్జీలు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో రెవెన్యూ క్లినిక్‌కు వచ్చిన అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై రెవెన్యూ క్లినిక్‌కు 63, సాధార‌ణ పీజీఆర్ఎస్‌కు 109 విన‌తులు అందాయి. అందులో జీవీఎంసీవి 48, పోలీస్ శాఖ‌వి 7, ఇతర శాఖలకు చెందినవి 54 ఉన్నాయి. కలెక్టర్‌తో పాటు జేసీ విద్యాధ‌రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.