News January 10, 2025
ఇందిరా గాంధీ చాలా బలహీనమైన వ్యక్తి: కంగన

మాజీ PM ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ని కంగనా రనౌత్ తెరకెక్కించారు. ఆ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇందిర చాలా బలహీనమైన వ్యక్తి అని నా పరిశోధనలో అర్థమైంది. ఆమె మీద ఆమెకే నమ్మకం లేదు. అందుకే పరిస్థితులపై మరింత నియంత్రణను కోరుకున్నారు. తన మనుగడకు చాలామందిపై ఆధారపడ్డారు. అయితే ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలన్న ఉద్దేశమూ నాకు లేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News September 4, 2025
మోదీతో ట్రంప్ బంధం తెగిపోయింది: బోల్టన్

భారత ప్రధాని మోదీతో ట్రంప్కు ఉన్న అనుబంధం తెగిపోయిందని యూఎస్ మాజీ NSA బోల్టన్ అన్నారు. ఇది ప్రతి ఒక్కరికీ గుణపాఠమని చెప్పారు. వ్యక్తిగత సంబంధాలు కొన్నిసార్లు సహాయపడినా, చెత్త నిర్ణయాల నుంచి మాత్రం రక్షించలేవన్నారు. ప్రస్తుతం అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతినడం రష్యా, చైనాతో మోదీ సన్నిహితంగా మారేలా చేశాయని అభిప్రాయపడ్డారు. US విషయంలో భారత్కు చైనా ప్రత్యామ్నాయంగా మారిందన్నారు.
News September 4, 2025
AP క్యాబినెట్ మరిన్ని నిర్ణయాలు

క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరించారు.
* 2025 ఆగస్టు 31 వరకు ఉన్న అనధికార కట్టడాల క్రమబద్ధీకరణకు నిర్ణయం
* చిత్తూరు జిల్లాలో 2 పరిశ్రమల ఏర్పాటుకు సమ్మతం
* మడకశిరలో HFCL కంపెనీ ఏర్పాటుకు ఆమోదం
* విశాఖ, అమరావతి, మంత్రాలయంలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు పచ్చజెండా
* పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం
News September 4, 2025
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న హైదరాబాద్లో జరిగే గణేశ్ శోభాయాత్రలో ఆయన పాల్గొనాల్సి ఉండగా, పర్యటన రద్దైంది.