News January 10, 2025
‘హైడ్రా’ నిర్ణయం మంచిదే.. కానీ: వెంకయ్య

TG: కనుమరుగవుతున్న చెరువులను పరిరక్షించేందుకు హైడ్రా పేరిట సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ప్రభుత్వం అందరినీ సమదృష్టితో చూడాలని సూచించారు. ఆక్రమణల కూల్చివేతలతో నష్టపోయిన పేదలను ఆదుకోవాలన్నారు. దేశం బాగుండటం అంటే మనుషులతో పాటు నదులు, చెరువులు, అడవులు, పశుపక్షాదులు బాగుండాలని వెంకయ్య అన్నారు.
Similar News
News November 18, 2025
BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt
News November 18, 2025
BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt
News November 18, 2025
INTRESTING: కృష్ణాంగారక చతుర్దశి కథ

పూర్వం అవంతీ నగరంలో భరద్వాజ మహర్షికి అప్సరసపై మోహం కలగగా, వీర్యం భూమిపై పడింది. దీంతో ఎర్రటి కుసుమం వంటి బాలుడు జన్మించాడు. అతడే అంగారకుడు. అతణ్ని భూదేవి పెంచింది. భరద్వాజుడు ఉపనయనం చేసి, గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు. అంగారకుడు ఓనాడు నర్మదా తీరాన నిష్ఠగా జపించగా, గణపతి సాక్షాత్కరించాడు. అప్పుడు అంగారకుడు తన పేరుతో ఓరోజు మంగళకరం కావాలని, ఆ రోజున గణపతిని పూజిస్తే కష్టాలు తొలగిపోవాలని వరం కోరాడు.


