News March 17, 2024
అనకాపల్లి: కరెంట్ షాక్తో సచివాలయ ఉద్యోగి మృతి

దేవరాపల్లి (మం) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ డెక్క చిరంజీవి(32) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు విధినిర్వహణలో భాగంగా ములకలాపల్లి పాలకేంద్రం వద్ద విద్యుత్ స్తంభానికి కట్టిన పోస్టర్ను తొలగించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎస్.ఐ డి.నాగేంద్ర ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Similar News
News February 6, 2026
విశాఖలో ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛతా కార్యక్రమాలు

జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఆర్కే బీచ్లో ‘శిఖర్ సే సాగర్ తక్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. శనివారం స్వచ్ఛత వాక్, యువతకు 5 కి.మీ.రన్, సైకత శిల్పాల ప్రదర్శన ఉంటాయి. ఆదివారం సైక్లోథాన్, బీచ్ క్లీనింగ్ నిర్వహిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరాన్ని ప్రథమస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.10 కి.మీ.రన్ రద్దు చేశారన్నారు.
News February 6, 2026
విశాఖలో TDP-జనసేన మధ్య అంతర్గత హీట్

విశాఖలో TDP-జనసేన మధ్య అంతర్గత రాజకీయ విభేదాలు తెరపైకి వచ్చాయి. సిట్టింగ్ MLA వంశీకృష్ణ, TDP ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ మధ్య సమన్వయం లోపించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవులు, అభివృద్ధి కార్యక్రమాల్లో TDP క్యాడర్కు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశం TDP హైకమాండ్ వరకు చేరినట్టు సమాచారం. పొత్తులో ఆధిపత్య పోరు కూటమికి సవాలుగా మారుతుందన్న చర్చ సాగుతోంది.
News February 5, 2026
రైల్వే జోన్పై కేంద్రం చిన్నచూపు.. విశాఖ వాసుల ఆవేదన

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. 2026 బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ. 170 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.3,500 కోట్ల అంచనా వ్యయం ఉన్న ఈ ప్రాజెక్టుకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవని, జోన్ నిర్మాణంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నామమాత్రపు కేటాయింపులతో జోన్ కల నెరవేరడంపై విశాఖ ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


