News March 17, 2024

చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే.!

image

చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద నేడు జరగనున్న TDP కూటమి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు PM మోదీ హజరవుతుండగా, పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ సాయంత్రం 4.10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7కు హైదరాబాద్ వెళతారు.

Similar News

News February 3, 2026

డాక్టర్ ఉమా గవిని.. మహిళా వైద్యులకు నిజమైన నిర్వచనం

image

నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా నిరతికి ప్రతీకగా నిలిచిన వారిలో గుంటూరుకు చెందిన NRI డాక్టర్ ఉమా గవిని ఒకరు. అమెరికాలో అలర్జీ–ఇమ్యునాలజీ నిపుణురాలిగా పనిచేసిన ఆమె, జీవితకాల సంపాదన రూ.20 కోట్లను GGHలో మాతా–శిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి విరాళం ఇచ్చారు.తన పేరు పెట్టవద్దని కోరడం ఆమె మహత్తర మానవత్వానికి నిదర్శనం.మహిళా వైద్యులు చరిత్ర సృష్టిస్తూ ఈ రోజున ఆమె ఎందరికో స్పూర్తి దాయకం.

News February 3, 2026

గుంటూరు: ఎస్పీ PGRSలో 170 ఫిర్యాదులు

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 170 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించి, ఫిర్యాది దారులకు సమాచారం అందించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా PGRS కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

News February 3, 2026

ధరల నియంత్రణపై పటిష్ఠమైన పర్యవేక్షణ: జేసీ

image

ధరల నియంత్రణపై పటిష్ఠ పర్యవేక్షణ జరగాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటిని ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు.