News March 17, 2024

అశ్విన్‌కు 500గోల్డ్ కాయిన్లు.. రూ.కోటి నజరానా

image

టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఇటీవల టెస్టు క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు, 500 వికెట్ల మైలురాయి చేరుకున్నందుకు అతడికి 500 గోల్డ్ కాయిన్లు, రూ.కోటి నజరానా ప్రకటించింది.

Similar News

News March 10, 2026

ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు వీరివే

image

ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో మహ్మద్ షమీ (22) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జహీర్ ఖాన్ (17), బుమ్రా(16), అశ్విన్ (16), సచిన్ టెండూల్కర్ (15), రవీంద్ర జడేజా (15) ఉన్నారు. టీ20 WC ఫైనల్‌లో 4 వికెట్లు తీసిన బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నారు.

News March 10, 2026

రజినీ-కమల్ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

image

రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనుండగా, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ మూవీ <<19199837>>ప్రోమో<<>> ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

News March 10, 2026

ట్రంప్ కామెంట్స్.. తగ్గిన క్రూడాయిల్ ధర

image

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే ముగుస్తుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన <<19341728>>వ్యాఖ్యలతో<<>> క్రూడాయిల్ ధర తగ్గింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $88కి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 23% తగ్గింది. ఆయిల్ ధరలను నియంత్రించేందుకు ట్రంప్ అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు అంతకుముందు వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇరాన్‌పై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆయిల్ ధరలు 50% పెరిగాయి.