News March 17, 2024
చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి?

TG: బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఎంపీ రంజిత్రెడ్డి ఇవాళ సాయంత్రం కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. ఆయనకు హస్తం పార్టీ చేవెళ్ల లోక్ సభ సీటును కేటాయించనున్నట్లు తెలుస్తోంది. తొలుత పట్నం సునీతారెడ్డికి ఈ సీటును ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు రంజిత్రెడ్డి చేరికతో ఆమెను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం సూచించిందట.
Similar News
News April 7, 2025
ఆరు రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం

TG: రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. ఈ ఆరు రోజుల్లోనే 8.75 లక్షల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు. పలు చోట్ల రవాణా, సాంకేతిక సమస్యలతో పంపిణీ నెమ్మదిగా సాగుతున్నా ఈ నెల 15వరకు పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.
News April 7, 2025
VIRAL: జీనియస్ డైరెక్టర్తో యంగ్ టైగర్

యంగ్ టైగర్ NTR, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ తాజాగా మీట్ అయ్యారు. ఈ సందర్భంగా వారు హగ్ చేసుకున్న ఫొటోను సుకుమార్ భార్య తబిత ఇన్స్టాలో పంచుకున్నారు. ‘తారక్కి ప్రేమతో’ అన్న క్యాప్షన్ ఇచ్చారు. రీపోస్ట్ చేసిన NTR, ‘నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్’ అని రాసుకొచ్చారు. దీంతో వీరి కాంబోలో మరో మూవీ రాబోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘నాన్నకు ప్రేమతో’ మూవీకి వీరు కలిసి పనిచేశారు.
News April 7, 2025
ఎకరానికి రూ.2 కోట్ల డిమాండ్.. కష్టంగా ఎయిర్పోర్టు భూసేకరణ!

TG: వరంగల్ జిల్లా మూమునూరు ఎయిర్పోర్టుకు భూసేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అక్కడి భూముల రేట్లు అమాంతం పెరిగాయి. ప్రభుత్వం రూ.40 లక్షలు ఇస్తామంటుండగా స్థానిక రైతులు ఎకరానికి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 253 ఎకరాల భూమికోసం ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించింది. కాగా.. ఎయిర్పోర్టు రాకతో కొత్త పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.