News January 11, 2025
కరీంనగర్: ఫుడ్ పాయిజన్.. అధికారుల SUSPEND

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మహాత్మా నగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఇటీవల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వి.రేవను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సమాచారం ఇవ్వకుండా విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News December 30, 2025
KNR: యూరియా సరఫరా నిరంతరం పర్యవేక్షించాలి

వ్యవసాయ అధికారులు ప్రతిరోజు మండల, క్లస్టర్ స్థాయిలో యూరియా సరఫరాను పర్యవేక్షించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల అధికారులతో ఆమె మాట్లాడారు. యూరియా నిల్వలు, సరఫరా, వ్యవసాయశాఖ, కేంద్రప్రభుత్వ పథకాలు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై చర్చించారు.
News December 30, 2025
KNR: సన్న బోనస్ ఊసేది..? రైతు భరోసా ఎప్పుడు..?

సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామన్న సర్కారు హామీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చాలామంది రైతుల ఖాతాల్లో నేటికీ నగదు జమకాలేదు. మరోవైపు ‘రైతు భరోసా’ ఊసే లేకపోవడంతో జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదన చెందుతోంది. అప్పులు తీరక, కొత్త సాగుకు సాయం అందక రైతులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
News December 29, 2025
కరీంగనర్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు.. వివరాలివే!

జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు, జనాభా వివరాలను అధికారులు విడుదల చేశారు. 2011 జనగణన ప్రకారం కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో 66 వార్డులు, 328870 మంది జనాభా, ST-5999, SC-36902 మంది ఉన్నారు. కాగా, చొప్పదండిలో 14 వార్డులు, 16459 మంది జనాభా కాగా.. ST 205, ఎస్సీ 3062, హుజురాబాద్లో 30 వార్డులు, 34555 జనాభా, ST-309, SC-6326, జమ్మికుంటలో 30 వార్డులు, 39476 జనాభా ST 286, SC 7623గా ఉంది.


